ADB: బోథ్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలను జిల్లా పాలనాధికారి రాజర్షి షా శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని తరగతి గదులు స్టోరేజ్ రూమ్, ఆర్ ఓ ప్లాంట్లను పరిశీలించారు. అనంతరం విద్యార్థులను అభ్యాస సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు. పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు.