VZM: రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి పాలన సాగుతుందని ఎమ్మెల్యే లోకం మాధవి వెల్లడించారు. డెంకాడ మండలం గంట్లాం గ్రామంలో శుక్రవారం పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. పశువుల సోకే వ్యాధులపై రైతులు అప్రమత్తంగా ఉండి తగిన చికిత్స చేయాలని సూచించారు. ఇందులో ఏపీ మార్కెఫెడ్ ఛైర్మన్ బంగార్రాజు పాల్గొన్నారు.