ASR: హుకుంపేట మండలంలోని కొంతిలి గ్రామంలో తాగునీటి పథకం నిర్మాణ పనులకు శుక్రవారం శంకుస్థాపన జరిగింది. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించి తాగునీటి బోరు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.1.50 లక్షల జిల్లా పరిషత్ నిధులతో బోరు నిర్మాణాన్ని ప్రారంభించామని ఎమ్మెల్యే తెలిపారు.