అనంతపురం: నగరంలో శుక్రవారం జరుగుతున్న రైతు పోరాటానికి మద్దతుగా వైసీపీ శ్రేణులు పామిడి నుంచి భారీగా తరలి వెళ్లారు. పామిడితో పాటు మండల వ్యాప్తంగా ఆయా గ్రామాలకు చెందిన పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు వాహనాల్లో తరలివెళ్లారు. జై జగన్మోహన్ రెడ్డి, వైసీపీ వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ వాహనాల్లో బయలుదేరారు.