NLR: నెల్లూరు రూరల్ పరిధిలోని 30 డివిజన్లో బుధవారం రోడ్డు విస్తరణ పనులను రాష్ట్ర టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ఆర్ నగర్ని అభివృద్ధి చేసేందుకు తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు, రోడ్డు విస్తరణలో భాగంగా విద్యుత్ స్తంభాలు మార్చే పని పూర్తి చేసి, రోడ్డు పనులు పూర్తి చేస్తారని అన్నారు.