NRML: బాసర మండలం కిర్గుల్ (కె) గ్రామంలో గత నాలుగు రోజుల నుండి త్రాగునీరు రాకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బుధవారం గ్రామస్తులు మాట్లాడుతూ.. గత నాలుగు రోజులుగా త్రాగునీరు లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని, అధికారులకు విన్నవించినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి త్రాగునీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.