BDK: భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న భాదితులకు CEIR పోర్టల్ ద్వారా రికవరీ చేసి తిరిగి వారికి అందించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. గత నెల రోజుల వ్యవధిలో మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న 220 మంది భాధితులకు బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫోన్లను అప్పగించామని పేర్కొన్నారు.