NLG: MG యూనివర్సిటీలో బిజినెస్ మెనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో యువ అధ్యాపకులకు, పరిశోధకులకు రీసెర్చ్ మెథడాలజీపై 10 రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య అలువాల రవి బుధవారం తెలిపారు. కేవలం 30 మందికి అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకొని పరిశోధనలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.