KMR: ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను గణితంలో ప్రోత్సహించడం అభినందనీయమని జిల్లా విద్యాశాఖ అధికారి రాజు అన్నారు. జిల్లాస్థాయి గణిత ప్రతిభా పరీక్ష సందర్భంగా బుధవారం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతిభ పరీక్ష ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీయవచ్చని తెలిపారు. మండల విద్యాశాఖ అధికారి ఎల్లయ్య పాల్గొన్నారు.