ASR: ఈనెల 14వ తేదీన జిల్లాలో నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలు నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ బుధవారం తెలిపారు. అనంతగిరి, అరుకు, డుంబ్రిగుడ, హుకుంపేట, పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జి.కె.వీధి, కొయ్యూరు, రంపచోడవరం, దేవీపట్నం, గంగవరం, రాజవొమ్మంగి, వై.రామవరం, మారేడిమిల్లి, అడ్డతీగల మండలాల్లో ఉన్న 84 నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.