SRPT: క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందని తహసీల్దార్ హిమబిందు అన్నారు. అనంతగిరి మండల శాంతినగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం కప్ క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను వెలికి తీయడానికి సీఎం కప్ క్రీడలను ప్రభుత్వం నిర్వహిస్తుందని అన్నారు.