కృష్ణా: రోడ్డు ప్రమాదాలను నివారించడానికి వాహనదారులు పాటించాల్సిన నియమాలపై మంగళవారం పోలీసులు విజిబుల్ పోలీసింగ్ ద్వారా అవగాహన కల్పించారు. పెనమలూరు మండలంలోని పలు కూడళ్లలో తనిఖీలు చేస్తున్న సమయంలో హెల్మెట్లు, సీటు బెల్టులను ధరించకుండా వాహనం నడుపుతున్నవారికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ట్రాఫిక్ నియమాలు, నిబంధనలను ఉల్లంఘించినందుకు కొందరికి జరిమానాలు విధించారు.