NLG: పదవితోపాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవర్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏ.ఆర్. విభాగంలో 8 మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి కల్పించి బ్యాడ్జిలను అందించారు. క్రమశిక్షణతో బాధ్యతగా పనిచేస్తూ ప్రజల మన్ననలను పొందాలని సూచించారు.