W.G: పాలకొల్లు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం రాత్రి టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా త్వరలో జరగబోయే నీటి సంఘం ఎన్నికల గురించి చర్చించారు. కూటమిలో అందరినీ భాగస్వాములు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర పాల్గొన్నారు.