కర్నూలు: ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం క్యాంపెయిన్లో ఉత్తమ మరుగుదొడ్లు నిర్వహించిన వారికి కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా పురస్కారాలు అందజేశారు. కర్నూలులో గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పోటీలను నిర్వహించి, హమారా శౌచాలయ్-హమారా సమ్మాన్లో భాగంగా వినియోగంలో లేని టాయిలెట్లను గుర్తించి వినియోగంలోకి తెచ్చేలా అవగాహన కలిగించడం, నిర్వహణపై చైతన్యం జరిగిందన్నారు.