W.G: పెరవలి మండలం కానూరు గ్రామ పరిధిలో ఒక విద్యుత్ స్తంభం కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. నరసాపురం నిడదవోలు రోడ్డులో నిత్యం వాహనాలు తిరిగే ప్రదేశంలో ఇలా ప్రమాదకర స్థితిలో విద్యుత్ స్తంభం ఉండడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.