ASR: ప్రభుత్వ పథకాలను గిరిజన పేదలకు అందించి ట్రైకార్కు పూర్వ వైభవం తెస్తామని ట్రైకార్ ఛైర్మన్ బొరగం శ్రీనివాసులు అన్నారు. మంగళవారం ఆయన పాడేరు ఐటీడీఏలో అధికారులతో సమావేశం నిర్వహించారు. గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని చెప్పారు. గిరిజన యువతకు బొలేరో, ఇన్నోవా, స్విప్ట్ వాహనాలకు రుణాలు అందిస్తామని చెప్పారు.