ADB: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును టీపీసీసీ ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర వైస్ ఛైర్మన్ సెడ్మకి ఆనంద్ రావు ఆదివారం సచివాలయంలో కలిశారు. ఐటీడీఏల ద్వారా ఆదివాసీలకు ఇందిరమ్మ ఇళ్లు, ఇతర సంక్షేమ పథకాలు మంజూరు చేయాలని కోరారు. ఈ విన్నపాలపై మంత్రి సానుకూలంగా స్పందించారని ఆనంద్ రావు తెలిపారు.