ATP: భూసమస్యలతో పాటు ప్రజలకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని యాడికి తహశీల్దార్ ప్రతాప్ రెడ్డి అన్నారు. యాడికి మండలం నగరూరు గ్రామంలో మంగళవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ అధికారి వీర్రాజు మాట్లాడారు. కేవలం భూ సమస్యలే కాకుండా ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు.