ASR: పెదబయలు మండలం కిముడుపల్లి గ్రామంలో విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబానికి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ రూ.3లక్షల తక్షణ ఆర్థిక సహాయాన్ని మంజూరు చేశారు. కొర్రా లక్ష్మి, పెద్ద కుమారుడు సంతోష్, కూతురు అంజలి విద్యుత్ ప్రమాదంలో సోమవారం మృతి చెందిన ఘటన విధితమే. ఈమేరకు జాయింట్ కలెక్టర్ అభిషేక్, ఐటీడీఏ పీవో వి.అభిషేక్ చేతుల మీదుగా అందజేశారు.