ఈ నెల 13న ప్రధాని మోదీ యూపీలోని ప్రయాగ్ రాజ్కు వెళ్లనున్నారు. మహాకుంభమేళా జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ ప్రయాగ్ రాజ్లో పర్యటించారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సుందరీకరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, ప్రధాని ప్రయాగ్ రాజ్లో సమీక్ష నిర్వహించనున్నారు.