AP: రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేదా? అని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. రైతు భరోసా రూ.20 వేలు ఎప్పుడు ఇస్తారని నిలదీశారు. ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయని స్పష్టం చేశారు. అయితే ఇచ్చిన హామీలను అమలు చేయాలని సూచించారు. దళారులు రైతులను దోచుకు తింటున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై వైసీపీ పోరాటం ఆగదని చెప్పారు.