AP: వైసీపీ భూబకాసురులు వేల ఎకరాలు కబ్జా చేశారని శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ ఆరోపించారు. ప్రభుత్వ భూముల నుంచి దేవాదయ, అసైన్డ్ భూముల వరకు అన్నీ కొట్టేశారని అన్నారు. కుటమి ప్రభుత్వానికి వచ్చిన వాటిలో 68 వేల ఫిర్యాదులు భూకబ్జాలపైనే ఉన్నాయని తెలిపారు. కాకినాడ పోర్టు భూములను బెదిరింపులతో రూ.12 కోట్లకే కొట్టేశారని పేర్కొన్నారు.