అన్నమయ్య: అక్రమ రేషన్ బియ్యం రవాణాపై పోలీసులు ఉక్కు పాదం మోపాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ చేసిన రైస్ మిల్లుల యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రేషన్ బియ్యాన్ని పక్క దారి పట్టిస్తున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు.