AP: నెల్లూరులోని పొంగూరులో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో రీసర్వే పేరుతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని తెలిపారు. గతంలో రెవెన్యూ రికార్డుల్లో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపించారు. పట్టా పాసు పుస్తకంపై జగన్ ఫొటోను ముద్రించి రైతులను దోపిడీ చేశారని మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కార దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు.