TG: వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశం నిర్వహించారు. వివిధ పథకాల పురోగతిపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. ప్రాథమిక సహాకార సంఘాల బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. వ్యవసాయ యాంత్రీకరణ, డ్రిప్ ఇరిగేషన్ అమలులో వేగం పెంచాలని సూచించారు. మార్చిలోపు లక్ష ఎకరాల్లో పామాయిల్ ప్లాంటేషన్ చేయాలని తెలిపారు.