TPT: ఓబులవారిపల్లె మండలం మంగంపేటలో జాయింట్ కలెక్టర్ గోవిందరావు భూ సేకరణ పనులను శనివారం పరిశీలించారు. కాలుష్య ప్రభావంతో తరలిస్తున్న అగ్రహారం ఆర్ఆర్-2 గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామ తరలింపు, భూ సేకరణ పురోగతిపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మంగంపేట ఏపీఎండీసీ ముగ్గురాయి గనులను సందర్శించి ఖనిజ సంపద వివరాలను పరిశీలించారు.