AP: YCP సభ్యుల తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. దేవుడి ఫొటోలు పట్టుకుని చెప్పులతో సభలోకి వచ్చారని ధ్వజమెత్తారు. సభలో ప్రతిరోజూ రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా YCP తీరు ఉందన్నారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగడమేంటని నిలదీశారు. హిందూ సమాజానికి YCP సభ్యులు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.