KRNL: రాష్ట్ర సచివాలయంలో ప్రిన్సిపల్ సెన్సస్ అధికారులతో సెన్సస్-2027 నిర్వహణపై శుక్రవారం సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి పాల్గొన్నారు. జిల్లాస్థాయిలో చేపట్టాల్సిన ప్రాథమిక ఏర్పాట్లు, శిక్షణ, తదితర అంశాలపై ఆమె అధికారులతో చర్చించారు. జిల్లాలో జనాభా గణనను విజయవంతం చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు.