MDK: నిజాంపేట మండలంలో 120 ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు చేసేందుకు గుర్తించినట్లు లీవ్ ఫామ్ రిసోర్సెస్ కంపెనీ ఫీల్డ్ ఆఫీసర్ సుజాత తెలిపారు. నార్లాపూర్లో నారాయణ, లక్ష్మి రైతుల భూముల్లో ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ చేపట్టారు. ఆయిల్ ఫామ్ తోటల ప్లాంటేషన్ చేసిన రైతులు సబ్సిడీ అందజేస్తున్నట్లు వివరించారు. రైతులు ఆయిల్ ఫామ్ తోటలు సాగు చేసేందుకు ముందుకు రావాలన్నారు.