VKB: చౌడాపూర్ మండలం పచ్చవుకుంట తండాలో శ్రీ బంగారు మైసమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన పూజా కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. గ్రామాల్లో ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు సామరస్యాన్ని పెంపొందిస్తాయని గ్రామప్రజలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అశోక్, సర్పంచ్ సవిత రాజు, చౌడాపూర్ సర్పంచ్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సలీమ్, రాము, గ్రామస్థులు పాల్గొన్నారు.