JGL: నూతన పాలకవర్గం ప్రజలు ఇచ్చిన అధికారంతో ఎవ్వరిని ఇబ్బందులకు గురి చేయవద్దని, నాయకులుగా కాకండా సేవకులుగా పనిచేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు. ధర్మపురి మున్సిపల్ నూతన పాలకవర్గం బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 15 వార్డుల్లో గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించాలన్నారు.