హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో ఐవీఎఫ్ చికిత్స పద్ధతిలో తొలిసారి ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షల రూపాయలు ఖర్చయ్యే ఈ చికిత్సను తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని, నేడు వారిని డిశ్చార్జ్ చేస్తున్నామని వైద్యులు తెలిపారు.