వనపర్తి: మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి జిల్లా కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ. 25 వేల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చింది. 2024లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పక్కా సాక్ష్యాలను కోర్టుకు సమర్పించారు. బాధితురాలికి న్యాయం జరిగిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు సంఘంలో మంచి సందేశాన్ని ఇచ్చిందని చెప్పారు.