KRNL: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పడిన బోర్డ్ ఆఫ్ విజిటర్స్ బృందం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీ.కబర్ధి నేతృత్వంలో మంగళవారం స్థానిక జిల్లా కారాగారాన్ని సందర్శించింది. ఈ బృందం జైలులోని వసతులు, ఖైదీల యోగక్షేమాలను స్వయంగా పరిశీలించింది. జైలు కిచెన్ను సందర్శించిన అధికారులు, ఖైదీలకు అందిస్తున్న భోజనాన్ని స్వయంగా రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేసింది.