ఏలూరు: ఆముదల అప్పలస్వామి కాలనీ ప్రాంతంలో ఈ నెల 22న గణేష్ నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా ఏలూరు పవర్ పేటలో ఉన్న 33/11 కేవీ సబ్ స్టేషన్ పరిధిలోని ప్రాంతాల్లో ఆదివారం సరఫరా నిలిపివేస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నటరాజన్ తెలిపారు. సాయంత్రం 4గం నుంచి నిమజ్జనం ఊరేగింపు పూర్తి అయ్యే వరకు ఆముదల అప్పలస్వామి కాలనీ, మహేశ్వర కాలనీలో సరఫరా ఉండదన్నారు.