విశాఖ: ప్రజా పోరాటాలతోనే ఏజెన్సీ అభివృద్ధి చెందుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి పీ.అప్పలనర్స శనివారం అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం వంద రోజుల పాలనపై ప్రజలు మిశ్రమంగా స్పందిస్తున్నారన్నారు. ఏజెన్సీలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులైనా సూపర్ సిక్స్ పథకాలు పూర్తి స్థాయిలో అమలు కాలేదన్నారు.