ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నం మండలంలోని మూలపాడులో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. సుమారు 3,725 కిలోలు ఉండవచ్చని అధికారులు తెలిపారు. అక్రమంగా నిల్వ చేశారని తెలుసుకున్న అధికారులు ఆకస్మికంగా దాడులు చేసి బియ్యాన్ని పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని మూలపాడులోని 49వ షాపుకు తరలించారు.