SKLM: జిల్లాలో సక్రమంగా విధులకు హాజరుకాని 17 మంది హోంగార్డులకు ఎస్పీ మహేశ్వరరెడ్డి శనివారం నోటీసులు జారీ చేశారు. ఈ 17 మంది సెప్టెంబరు 23 ఆదివారం ఉదయం 10 గంటలకు ఎచ్చెర్లలోని (ఆర్మ్ డ్ రిజర్వుడ్) ఏ. ఆర్ మైదానానికి రావాలని కోరారు. ఎస్పీ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలన్నారు.