PLD: పవిత్రమైన తిరుమల తిరుపతి లడ్డూలను చేపనూనె, జంతు కొవ్వులతో కల్తీ చేసి కోట్లాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీయడం దుర్మార్గమని మాచర్ల ఆర్య వైశ్య యువనాయకుడు కంభంపాటి అనిల్ కుమార్ అన్నారు. ధనార్జన కోసం గత పాలకులు ఇంతటి నీచమైన పనికి దిగజారడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతటి పాపానికి ఒడిగట్టిన వారికి ఏ శిక్ష విధించినా తక్కువేనని ఆవేదన వ్యక్తం చేశారు.