AP: రాష్ట్రంలో కక్ష సాధింపులు తప్ప శాంతిభద్రతలు లేవని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. సభలో శాంతిభద్రతలపై చర్చించాలని కోరితే అనవసరమైన విషయాలను ప్రస్తావించారని విమర్శించారు. ప్రధానిని జగన్ ఏరోజు అగౌరవపరచలేదని తెలిపారు. రాష్ట్రంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై హోంమంత్రి అనిత వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు.