TG: సీఎం రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరిస్తున్నాని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. గోదావరి ప్రాజెక్టు అంశంపై అసెంబ్లీలో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా దేవాదుల ప్రాజెక్టు పనులు పూర్తి కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులకు డెడ్లైన్లు మారుతున్నాయి కానీ.. పూర్తి కావట్లేదని మండిపడ్డారు.