TG: అణగారిన వర్గాల ఆశాజ్యోతి, స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా CM రేవంత్ రెడ్డి ఆయనకు నివాళులర్పించారు. జగ్జీవన్ రామ్ జయంతి రోజున జరుపుకునే “సమతా దివస్” సందర్భంగా, సమాజంలోని వివక్షలకు వ్యతిరేకంగా సమానత్వం, ఐక్యత, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.