కోనసీమ జిల్లా డ్వామా పీడీగా బాధ్యతలు స్వీకరించిన రాంబాబు సోమవారం సాయంత్రం అమలాపురంలో ఎంపీ గంటి హరీశ్ మాధుర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉపాధి హామీ పథకంలో పనులు పారదర్శకంగా జరిగేలా చూడాలని ఈ సందర్భంగా ఎంపీ సూచించారు. క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించి, ఎక్కడా అక్రమాలకు తావులేకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.