ADB: జిల్లాలో 16,000 ఇందిరమ్మ ఇళ్లకు రూ.220 కోట్లు మంజూరయ్యాయని, ఐదేళ్లలో అర్హులందరికీ ఇళ్లు అందిస్తామని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఉట్నూరులో 66 ఇళ్లకు రూ.90 లక్షలు జమయ్యాయి. ఖానాపూర్లో కొత్త రెసిడెన్షియల్ స్కూల్ మంజూరవడమే కాకుండా, టాటా సంస్థ సహకారంతో ఐటీఐలో అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్ (ATC) ప్రారంభమైందని ఆయన వెల్లడించారు.