HYD: గల్ఫ్ బాధితుల కోసం ప్రవాసి ప్రజావాణి పేరుతో ప్రభుత్వం కౌంటర్ను ఏర్పాటు చేయనుంది. ఈ కార్యక్రమం వారానికి రెండు రోజులు అంటే (బుధ, శుక్ర) వారాల్లో నిర్వహించనున్నారు. నేడు ప్రజా భవన్లో మంత్రి పొన్నం ప్రభాకర్, PCC చీఫ్ మహేష్ గౌడ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల సమస్యల పరిష్కారానికి దీన్ని ఏర్పాటు చేయనున్నారు.