టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో దర్యాప్తు చేస్తోన్న సిట్పై తమకు నమ్మకం లేదని వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల అన్నారు. బేగం బజార్ పోలీస్ స్టేషన్లో మంత్రి కేటీఆర్ మీద ఈ రోజు ఫిర్యాదు చేశారు.
తెలుగు రాష్ట్రాల మధ్య అనేక రోజులుగా ఉన్న వివాదం సమసినట్లు తెలుస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మధ్య న్యూఢిల్లీలోని అశోకా రోడ్డులో ఉన్న ఆంధ్ర భవన్లోని ప్రధాన ఆస్తుల విభజనకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కొత్త ప్రతిపాదనను సూచించగా ఏపీ ఓకే చెప్పింది.
TSPSC పేపర్ లీకేజీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా మరో ఇద్దరు వ్యక్తులను సిట్ అధికారులు అరెస్టు చేశారు. దీంతో అరెస్టైన వారి సంఖ్య 21కి చేరింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఇంకా నిందితులు ప్రశ్నపత్రాలు ఎంత మందికి అమ్ముకున్నారనే వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు.
ఖమ్మం జిల్లా మంగలగూడెంలో దారుణం చోటుచేసుకుంది. దహన సంస్కారాల సమయంలో అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. ఏర్పాట్లు చేస్తుండగానే మా భూమిలో పెట్టొద్దని ఘర్షణ జరిగింది. అంతేకాదు ఒకరిపై ఒకరు ఇరు వర్గాలు పరస్పరం కర్రలతో దాడులు చేసుకున్నారు. దీంతో దహన సంస్కారాల కార్యక్రమం ఆగిపోయింది. అచ్చం బలగం మూవీలో మాదిరిగా మా భూమిలో సమాధి కట్టవద్దని అన్నదమ్ములు గొడవ పడినట్లుగా ఈ సంఘటన ఉంది.
సొంత ఊరు, ఉన్న ఇంటిని వదిలి వెళ్లాలనిపించలేదు. దీంతో వెంకటయ్య ఈనెల 2న మంగళవారం గ్రామంలోని ఓ ప్రజాప్రతినిధి ఇంట్లో బస చేశారు. అక్కడ తన పరిస్థితి చెప్పి బాధపడ్డారు. తెల్లవారుజామున బుధవారం (మే 3)న నవాబుపేటకు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లారు.
జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)లోని కిష్త్వార్ జిల్లాలో అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ (ALH) ధ్రువ్ గురువారం ఉదయం కుప్పకూలడంతో ఒక సాంకేతిక నిపుణుడు మరణించగా, ఇద్దరు పైలట్లు గాయపడ్డారు.
తెలంగాణ గవర్నర్ తమిళి సైపై మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్ విరుచుకుపడ్డారు. సచివాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదనే కామెంట్పై స్పందించారు.
బైరి నరేష్ దేవుళ్ళ గురించి గొప్పగా మాట్లాడాడు. అసలు ఏం చెప్పాడో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం.
చికెన్ పకోడిలో కారం ఎక్కువైందని చెబితే ఓనర్ జీవన్ రెచ్చిపోయాడు. కస్టమర్ నాగార్జునపై కత్తితో దాడి చేశాడు.
బాలికపై అత్యాచారానికి పాల్పడిన బీఆర్ఎస్ నేతపై పోలీసులు కేసు నమోదు చేశారు.
బాగా చదువుకున్న వారికి ఎక్కువ తెలివితేటలు ఉంటాయని, చదువుకోని వారికి పెద్దగా తెలివి ఉండదు అనుకుంటారు. కానీ, కొందరికి చదువుకు, తెలివితేటలకు అస్సలు సంబంధం ఉండదు. ఓ వ్యక్తి చదివింది కేవలం ఇంటర్ అయినా, మోసం చేసి రూ. కోట్లు కొల్లగొడుతున్నాడు. ప్రతిరోజూ రూ.5 నుంచి రూ.10 కోట్ల లావాదేవీలు చేస్తాడంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. హైదరాబాద్(hyderabad)లో సైబర్ మోసాల(cyber crime)కు పాల్పడుతున్న ఓ కేటుగాడిని తాజ...
పొంగులేటి శ్రీనివాస రెడ్డిని బీజేపీలోకి రావాలని ఈటల రాజేందర్ ఆహ్వానించారు. పొంగులెటి ఇంటికెళ్లగా.. అక్కడికి జూపల్లి కృష్ణారావు కూడా వచ్చారు.
అసభ్య ఫొటోలు పంపుతుండడంతో పాటు నగ్న వీడియో కాల్స్ చేయాలని ఒత్తిడి చేస్తున్నాడు. అలాగే ఒకరోజు అతడు న్యూడ్ కాల్ చేయడంతో ఆ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. అర్ధరాత్రి వరకు మహిళలతో వీడియోలు మాట్లాడుతూ వేధిస్తున్నాడు.
న్యూఢిల్లీ వసంత్ విహార్లో గల బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ఈ రోజు సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు.
సికింద్రాబాద్లోని అల్వాల్(alwal) పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి ఓ యువతి తన కారుతో బీభత్సం సృష్టించింది. దీంతో ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. అయితే ఆ కారు డ్రైవింగ్ చేసిన యువతిని పోలీసులు సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా గుర్తించారు.