కరీంనగర్ కలెక్టర్, సీపీని కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. వారిపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకుంది.
లోకల్, నాన్ లోకల్ అనే వాళ్లందరికి నేను ఇచ్చే సమాధానం ఒకటే అంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కేసీఆర్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో బీజేపీకి అధికారం ఇవ్వాలని బీజేపీ అగ్ర నేత, కేంద్ర మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. అధికారంలోకి వస్తే సీఎంగా బీసీ వ్యక్తిని నియమిస్తామని ఆయన అన్నారు.
ఓడిపోయి ఇంట్లో ఉన్న తుమ్మల నాగేశ్వరరావుని పిలిచి మంత్రిని చేశానని.. కానీ ఆయన ఇప్పుడు అవాకులు చెవాకులు పేలుతున్నారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీలో పలువురు నేతలు జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో చేరారు.
చోరీకి గురయిన మందు గుండు సామగ్రిని సికింద్రాబాద్ (Secunderabad) రైల్వే పోలీసులు రికవరీ చేసి.. దొంగిలించిన వ్యక్తిని అరెస్టు చేశారు.
హైదరాబాద్లోని నేషనల్ పోలీస్ అకాడమీలో నిర్వహించిన ఐపీఎస్ ల పాసింగ్ ఔట్ పరేడ్కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మొదట వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులు అర్పించి..ఆ తర్వాత వివిధ రకాల చట్టాల గురించి ప్రస్తావించారు.
పెండ్లి జరుగుతుండగానే పోలీసులు వచ్చి.. పెండ్లి ఆపండి! వరుడు కేడీ అని చెప్పి బేడీలు వేసే సన్నివేశాలు సినిమాల్లోనే చూస్తుంటాం. అలాంటి సన్నివేశమే నిజజీవితంలోనూ జరిగింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ అచ్చంపేటలో చేసిన పలు వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీశాయి.
నేడు ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్, బిత్తిరి సత్తి భేటీ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ముదిరాజ్ ఓటర్లను ఆకర్షించేందుకే బిత్తిరి సత్తిని కేటీఆర్ తమ వైపు తిప్పుకుంటున్నారే ప్రచారం జోరుగా సాగుతోంది.
బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్యకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆఫీసు నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తిరిగి పార్టీలో చేరాలని.. ఢిల్లీ వచ్చి రాహుల్ గాంధీని కలువాలని కోరారని విశ్వసనీయంగా తెలిసింది.
పది సంవత్సరాల అవినీతి పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందని ఎమ్మెల్యే రఘునందనరావు అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మాట తప్పని పార్టీ అని, పేదల బతుకులు మారాలంటే బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు.
భైంసా పరిస్థితి చూస్తే.. అసలు మనం ఇండియాలో ఉన్నామా అనే సందేహాం కలుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.
దసరా పండగ సందర్భంగా టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ బస్సుల ద్వారా టీఎస్ఆర్టీసీకి కేవలం 10 రోజుల్లోనే రూ.25 కోట్ల వరకూ ఆదాయం లభించింది.
విపక్ష నేతలు చేస్తోన్న సవాళ్లపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. కేసీఆర్ దమ్మెంటో ఇండియా మొత్తం చూసిందని.. ఇప్పుడు చూడాల్సిది ఏమీ లేదన్నారు.