గుండెపోటు ఎందుకు వస్తుందో తెలియడం లేదు. అనూహ్యంగా గుండెపోటుతో చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబాల్లో తీరని శోకం మిగిలిస్తోంది. డ్యాన్స్ చేస్తుండగా.. వర్కౌట్లు (Workouts) చేస్తుండగా.. ఏ పని చేస్తున్నా ఉన్నట్టుండి కుప్పకూలుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఇలాంటి హఠాన్మరణాలు (Suddenly Deaths) సంభవించడం కలకలం రేపుతున్నాయి.
వైద్య విద్యార్థిని ప్రీతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం (Govt Of Telangana) అండగా నిలబడింది. ఐదు రోజుల పాటు కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న ప్రీతిని కాపాడేందుకు వైద్యులు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ చివరికి మృత్యువుతో పోరాడలేక ప్రీతి కన్నుమూసింది. ర్యాగింగ్ ధాటికి ప్రాణం కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న బాధిత కుటుంబానికి ప్రభుత్వం బాసటగా నిలిచింది.
మెడికో ప్రీతి(Preeti) ఆదివారం రాత్రి 9.16 గంటలకు మృతి చెందినట్లు నిమ్స్(NIMS) వైద్యులు ప్రకటించారు. ఇటీవలె మెడికో ప్రీతి(Preeti) ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమెను హైదరాబాద్ నిమ్స్(NIMS)లో చేర్చి చికిత్స అందిస్తుండగా నేడు కన్నుమూసింది. ఆదివారం సాయంత్రం వరకూ కోలుకుంటోందని చెబుతూ వచ్చిన వైద్యులు సాయంత్రం తర్వాత పరిస్థితి విషమించినట్లు తెలిపారు.
వరంగల్(Warangal) ఎంజీఎం(MGM)లో సీనియర్ వేధింపులు తాళలేక విద్యార్థి ప్రీతి(Preethi) ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీతి(Preethi)కి నిమ్స్(NIMS) ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. అయితే ప్రీతి(Preethi) ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని నిమ్స్(NIMS) వైద్యులు వెల్లడించారు. ఆమెకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. నిపుణుల బృందం ఆధ్వర్యంలో ప్రీతికి చికిత్స అందిస...
గాంధీ హాస్పిటల్ (Gandhi hospital) లో పేషంట్ వెంట వచ్చే బంధువులకు ఒకరు లేదా ఇద్దరికే అనుమతి ఇస్తామని సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు (Raja Rao) తెలిపారు. కొన్నిసార్లు వారిని చూడటానికి 6 నుంచి 10 మంది వరకు కుటుంబ సభ్యులు హాస్పిటల్ కు రావడం, గేట్ల వద్ద సిబ్బందితో గొడవలకు దిగి దుర్భాషలాడటం, కొట్టడం లాంటి సంఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని ఆయన తెలిపారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సటీ (HCU ) ఎన్నికల్లో SFI కూటమి ఘన విజయం సాధించింది. SFI, ASA, DSU సంఘాల కూటమి తరుపున పోటీ చేసిన అభ్యర్థులందరూ గెలిచారు. తన సమీప ప్రత్యర్థి ఏబీవీపీ (ABVP )పై ఘన విజయం సాధించింది. అధ్యక్షుడుగా ప్రజ్వల్ 608 ఓట్ల మెజార్టీతో గెలవగా, ఉపాధ్యక్షుడిగా పృధ్వీ 700, ప్రధాన కార్యదర్మిగా కృపరియా గెలిచారు.
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో సూసైడ్ అటెమ్ట్ కోసం ప్రయత్నించిన ప్రీతి ఫోన్ కాల్ సంచలన సంభాషణ ఒకటి వెలుగులోకి వచ్చింది. దీనిలో సైఫ్ వేధించినట్లు స్పష్టంగా ప్రీతి తన తల్లితో చెప్పడం బయటకు వచ్చింది. సీనియర్లు అందరూ ఒక్కటిగా ఉన్నారని, సైఫ్ తనతోపాటు అనేక మందిని వేధించినట్లు ఫోన్ సంభాషణలో తెలిపింది.
ఏపీలోని గుంటూరు జిల్లాలో ఐటీ అధికారులమని 50 లక్షలు దోచుకున్న దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 50 లక్షల రూపాయలకు గాను రూ.48.30 లక్షల నగదు, అరకిలో గోల్డ్ కు గాను 132 గ్రాముల బంగారంను స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే ఇంప్రూవ్ అవుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండు సార్ల కంటే ఎక్కువ గెలిచే అవకాశం లేదని అంటున్నారు. ఇంకెం విశేషాలు చెప్పారో తెలియాలంటే ఈ పూర్తి ఇంటర్వ్యూను చూసేయండి
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఐదేళ్ల క్రితం డెలివరీ కోసం ఓ మహిళ ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా ఆపరేషన్ చేసిన మహిళా డాక్టర్ కత్తెరను కడుపులోనే మర్చిపోయింది. గత ఐదేళ్లుగా నరకం అనుభవించిన మహిళ ఇటీవల స్కాన్ చేయించుకోగా అసలు విషయం తెలిసింది.
intintiki telugudesam:తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ (tdp) జాడ లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్లో కీ రోల్ పోషిస్తోన్న.. తెలంగాణలో మాత్రం ప్రభావం లేదు. పార్టీ నుంచి ముఖ్య నేతలు వెళ్లిపోయారు. ఇటీవల కాసాని జ్ఞానేశ్వర్కు (kasani gnaneshwar) తెలంగాణ టీడీపీ పగ్గాలను చంద్రబాబు (chandrababu) అప్పగించిన సంగతి తెలిసిందే. దీంతో టీడీపీకి తెలంగాణలో పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కాసాని (kasani) వ్యుహారచన చ...
మార్చి 2వ తేదిన తారకరత్న(Tarakaratna) పెద్ద కర్మ కార్యక్రమం జరగనుంది. హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో పెద్ద కర్మను కుటుంబ సభ్యులు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఓ కార్డును కూడా కుటుంబీకులు ముద్రించారు. ఆ కార్డులో వెల్ విషర్స్ గా బాలక్రిష్ణ(Balakrishna), వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి(Vijaya sai reddy) పేర్లను ముద్రించడం విశేషం.
ys sharmila meet governer:తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (ys sharmila) గవర్నర్ (governer) తమిళి సై సౌందర రాజన్ను కోరారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఈ రోజు మధ్యాహ్నం రాజ్ భవన్లో (Raj bhavan) గవర్నర్తో భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన పరిణామాలను ఆమెకు వివరించారు.
తెలంగాణలో నాన్ వెజ్ ప్రియులకు శుభవార్త. ఎందుకంటే త్వరలోనే మొదటిసారిగా హైదరాబాద్ పరిధిలో మటన్ క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ గొర్రెల, మేకల అభివృద్ది సంస్థ ఛైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ పేర్కొన్నారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన ఫిష్ క్యాంటీన్లు సక్సెస్ అయిన క్రమంలో.. మటన్ క్యాంటీన్లను మార్చిలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.