MHBD: వాహనదారులు ప్రమాద సమయంలో తమ విలువైన ప్రాణాలను కాపాడుకోవడానికి హెల్మెట్లను తప్పకుండా ధరించాలని తొర్రూరు డీఎస్పీ కృష్ణ కిషోర్ అన్నారు. దాతల సహాయంతో పలువురు వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లను అందజేశారు. వాహనదారుల ప్రాణాలను కాపాడటమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ‘అరైవ్-అలైన్’ అమలు చేస్తుందన్నారు.
ADB: నార్నూర్ మండలం కొత్తపల్లి మాల్కుగూడలో సోమవారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో కనక భీంరావ్కు చెందిన గోధుమ, మొక్కజొన్న పంటలు తీవ్రంగా నష్టపోయాయి. సాయంత్రం కురిసిన భారీ వర్షం, బలమైన గాలుల వల్ల పంట పొలం నాశనమైందని రైతు తెలిపారు. ఈ సంఘటన రైతుకు తీరని నష్టాన్ని కలిగించింది.
PDPL: మంథనిలో నేటి నుంచి మూడు రోజుల పాటు 24,25,26 తేదీలలో మహా సహస్రావధాని పద్మశ్రీ డాక్టర్ గరికిపాటి నరసింహా రావు ప్రవచనములకు ఘనంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. మూడు రోజులపాటు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు మంథనిలోని మణికంఠ కళా ప్రాంగణం అయ్యప్ప దేవాలయంలో నిర్వహించుటకు నిర్ణయించకున్నారు. ఈ కార్యక్రమానికి భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని నిర్వహకులు తెలిపారు.
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, పరీక్షల నిర్వహణకు కావలసిన ఏర్పాట్లను అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల పరిరక్షణలో, పరీక్షల నిర్వహణ జరుగుతుందని, పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 163 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీస్ అధికారులు తెలిపారు.
BHNG: రాజాపేట మండలం బేగంపేటకి చెందిన శతాధిక వృద్ధురాలు ఫ్రీడమ్ ఫైటర్ వలిమెల లక్ష్మి (106) సోమవారం సాయంత్రం మృతి చెందారు. ఆమె భర్త హన్మంత్ స్వాతంత్ర సమర యోధుడు. జైలు జీవితం కూడా గడిపారు. 106 సంవత్సరాలకు పైగా జీవించిన లక్ష్మి రజాకార్లతో పోరాటం, బాధలు, బాధ్యతలు, మనుమరాండ్లతో సుఖదుఃఖాలు, మనుమలు, పరిపూర్ణ జీవనం గడిపారని గ్రామస్తులు సంతాపం తెలిపారు.
వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్, రేవల్లి సొసైటీల్లో యూరియా పంపిణీ కోసం స్లాట్ బుకింగ్ ఓపెన్ అయిందని అధికారులు తెలిపారు. నాగపూర్ సొసైటీలో 300 బస్తాలు, రేవల్లి సొసైటీలో 300 బస్తాలు అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదికారులు సూచించారు.
BDK: బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో ఇద్దరు ఎస్సైలు, వారి తండ్రిపై చీటింగ్ కేసు నమోదైంది. అధిక లాభాల పేరుతో బూర్గంపహాడ్ మండలం, సారపాకకు చెందిన మహిళ నుంచి రూ.1.82 కోట్లు తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ముగ్గురిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
NZB: రుద్రూర్లో న్యాయవాది కళ్యాణి నివాసానికి బీజేపీ NZB జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి మంగళవారం స్థానిక బీజేపీ నాయకులతో కలిసి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కళ్యాణికి ధైర్యం చెప్పి, పూర్తి న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్బంగా దినేశ్ మాట్లాడుతూ.. దాడికి పాల్పడిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. స్థానిక శ్రీ మహాలక్ష్మి వేంకటేశ్వర స్వామి దేవాలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా నిర్వహించిన బాలాలయ ప్రతిష్ఠాపన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ శోభాయాత్రలో ఒగ్గుడోలు కళాకారుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వారి ప్రదర్శనలు భక్తులను ఎంతగానో మంత్రముగ్ధులను చేశాయి.
HNK: హసన్ పర్తి మండలం సిద్ధాపురం గ్రామంలో మంగళవారం బాల్నే మొగిలి సొంత మరదల చేత దారుణ హత్యకు గురయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మొగిలిని గొడ్డలితో, కత్తులతో అత్యంత క్రూరంగా హత్య చేసినట్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. కాగా, హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
RR: రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు టీసీజీఎస్-1694 ‘విశిష్ట’ వేరైటీ వేరుశనగ పై ఫీల్డ్ డే నిర్వహించారు. పూత దశలో తగిన నీరు, జిప్సం, జింక్ వినియోగంతో దిగుబడి పెరుగుతుందని డా. సంతోష్ కుమార్ సూచించారు. పంట విస్తీర్ణం, నాటే దూరం, సమతుల ఎరువుల వినియోగం, కలుపు నియంత్రణ, యాంత్రీకరణపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు.
NLG- తమ సమస్యల పరిష్కారం పై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో, నేడు ఆర్టీసీ కార్మికులు చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి సిద్ధమయ్యారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని డిపోల నుంచి కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చేలా కార్మిక జేఏసీ ఏర్పాట్లు పూర్తి చేసింది.
WGL: ఉమ్మడి జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఫస్ట్ ఇయర్ పరీక్షలు బుధవారం (మార్చి 4), సెకండ్ ఇయర్ పరీక్షలు గురువారం (మార్చి 5) నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాల వారీగా WGL-12,166, HNK-38,600, JN-8,605, MHBD-8,287, BHPL-3,778, MLG-3,841 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు అధికారులు తెలిపారు.
HYD: బాల్య వివాహాల రహిత సమాజాన్ని నిర్మిద్దామని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన పిలుపునిచ్చారు. బాల్యవివాహ విముక్తి రథాన్ని కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. బాల్యవివాహాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక వాహనం ద్వారా ప్రచారం చేస్తామని చెప్పారు. 18 ఏళ్లలోపు యువతులకు, 21 ఏళ్లలోపు యువకులకు పెళ్లి చేస్తే బాల్య వివాహం కిందికి వస్తుందన్నారు.
MDCL: KPHB 4వ ఫేజ్ దేవాలయ సముదాయాల ప్రధాన రహదారిలో ఓవైపు వాహనాలు, మరోవైపు గోడల పక్కన పాడుబడ్డ బండ్లు ఉండటంతో రోడ్డు మరింత ఇరుకుగా మారి ఇబ్బంది పడుతున్నట్లుగా పలువురు వాహనదారులు వాపోయారు. దీంతో రోడ్డుపై ప్రయాణించడానికి చాలా కష్టంగా ఉంటుందని, ఇలాంటి వాటిపై ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరించాలని పలువురు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.